Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదు పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లికూతురు అరెస్ట్

వినయ్ కుమార్ Jun 26, 2026 7:31 PM పశ్చిమగోదావరి 1 viewsabout 2 hours ago
ఐదు పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లికూతురు అరెస్ట్ - Udayam Digital
ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లాడుతూ ఐదుగురి యువకులను మోసం చేసిన నిత్య పెళ్లికూతురు వజ్రపు మణి అలియాస్ శ్వేతారెడ్డి (27)ని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యవర్తులతో కలిసి ఎదురుకట్నం వచ్చేలా సంబంధాలు కుదుర్చుకోవడం, పెళ్లయ్యాక కొద్దిరోజులకే పారిపోవడం ఈమె పద్ధతి. 2025లో పెద్దవడుగూరుకు చెందిన సుధీర్‌రెడ్డిని పెళ్లాడి మోసం చేయడంతో కేసు నమోదైంది. కాగా, ఇటీవల కర్ణాటకకు చెందిన మరో వ్యక్తిని పెళ్లాడి, ఆరు రోజుల తర్వాత మదనపల్లెకు పారిపోతుండగా పోలీసులు ఆమెను పట్టుకున్నారు.

Comments

G
Loading comments...