Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్‌లో భారీగా గోల్డ్ పేస్ట్ సీజ్

రవళి దేవి Jun 26, 2026 11:19 AM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు తమ ప్యాంట్ల నడుము భాగంలో పేస్ట్ రూపంలో దాచి తరలిస్తున్న 2.271 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ బంగారం విలువ రూ.3.36 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.

Comments

G
Loading comments...