వార్తలకు తిరిగి వెళ్లండి

బిడ్డ పుట్టిన గంటలోపు తల్లి ముర్రుపాలు తాగించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీదేవి సూచించారు. గురువారం తాడేపల్లిగూడెం (ఎం) ఎల్. అగ్రహారం అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లుల సమావేశంలో ఆమె ఈ సూచనలు చేశారు.
తల్లులు పోషకాహారం తీసుకుంటే ఆ పోషకాలు తల్లి పాల ద్వారా బిడ్డకు అందుతాయని తెలిపారు. బిడ్డ పోషణ తల్లి చేతుల్లోనే ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త అన్నపూర్ణ పాల్గొన్నారు.
Comments
Loading comments...

