Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొగతకు పర్యాటకుల వెల్లువ

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 27, 2026 12:28 PM ములుగు General
బొగతకు పర్యాటకుల వెల్లువ - Udayam
ములుగు జిల్లా బొగత జలపాతాన్ని ఆదివారం వేలాది మంది పర్యాటకులు సందర్శించారు. హైదరాబాద్‌, వరంగల్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులతో జలపాతం పరిసరాలు సందడిగా మారాయి. వరద నీటి ప్రవాహాన్ని తిలకిస్తూ సందర్శకులు స్వీయ చిత్రాలు దిగారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఈత కొలనులో సందడి చేయగా, పిల్లలు పార్కులో ఆటలతో ఉల్లాసంగా గడిపారు.

Comments

G
Loading comments...