వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో గురువారం చిరుజల్లులతో వర్షం కురిసింది. రెండు వారాలుగా వర్షాలు కురవకపోవడంతో వేడి తీవ్రత పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నీరు లేక వరి నారు, రైతులు వేసిన వరి నాట్లు ఎండిపోతున్నాయి.
వర్షం కురవడంతో వాతావరణం చల్లబడి ప్రజలు సేద తీరుతున్నారు. వర్షం వరి నారుకు ఉపయోగ పడుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

