వార్తలకు తిరిగి వెళ్లండి
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం: మంత్రి కొల్లు రవీంద్ర

చిన్న క్యాంప్ బెల్ గ్రామంలో హెడ్ వాటర్ ట్యాంక్ను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. కూటమి ప్రభుత్వ ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధి మాత్రమేనని, ప్రతిపక్షాల పసలేని విమర్శలను తాము పట్టించుకోమని స్పష్టం చేశారు.
జలజీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. వేగంగా సాగుతున్న బందరు పోర్టు పనులు పూర్తయితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...