వార్తలకు తిరిగి వెళ్లండి
తిరుమలలో తలనీలాలు: ఆచారం వెనుక పురాణ కథ

తిరుమలలో భక్తులు తలనీలాలు సమర్పించే ఆచారం వెనుక ఒక ప్రముఖ పురాణ కథ ఉంది. శ్రీ మహావిష్ణువు వేంకటాద్రిపై నివసిస్తున్న సమయంలో ఆయన తలకు గాయమై జుట్టు ఊడిపోగా, నీలాదేవి అనే గంధర్వ కన్య తన జుట్టును కత్తిరించి స్వామివారికి సమర్పించింది.
ఆమె భక్తికి మెచ్చిన శ్రీ వేంకటేశ్వరస్వామి.. తనను దర్శించుకునే భక్తులు సమర్పించే తలనీలాల పుణ్యం నీలాదేవికే చెందుతుందని వరం ఇచ్చారు. దాంతో ఈ ఆచారం ప్రారంభమైందని విశ్వసిస్తారు.
Comments
Loading comments...