వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ప్రజలకు అప్రమత్తత సూచనలు జారీ చేశారు. మహిళలు, వృద్ధులు అధికమొత్తంలో బంగారు ఆభరణాలు ధరించి ఒంటరిగా వెళ్లవద్దని బుధవారం సూచించారు. శుభకార్యాలకు కుటుంబ సభ్యులతో వెళ్లాలని, నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రయాణించకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112ను సంప్రదించాలని కోరారు.
Comments
Loading comments...

