వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల దుస్థితిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన 12 కిలోమీటర్ల పాదయాత్రలో ఆయన పాల్గొని, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆరోపించారు.
నిధులు మంజూరైనా పనులు పూర్తి చేయలేదని విమర్శించారు. వెంటనే రోడ్లకు మరమ్మతులు చేపట్టడంతో పాటు, సాగునీరు అందించి రైతును ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

