Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఎంఎస్ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నిరసన

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 18, 2026 10:15 AM వికారాబాద్General
బీఎంఎస్ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నిరసన - Udayam
కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బీఎంఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కనీస వేతనం రూ.30 వేలు చెల్లించాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, గిగ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని బీఎంఎస్ జిల్లా కన్వీనర్ రాఘవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...