Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూమిలేని నిరుపేదలకు 12వేలు ఇవ్వాలి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 26, 2026 10:07 PM నాగర్ కర్నూల్General
భూమిలేని నిరుపేదలకు 12వేలు ఇవ్వాలి - Udayam
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం బుధవారం అచ్చంపేట సీఐటీయూ కార్యాలయంలో జరిగింది. జిల్లా కార్యదర్శి పి.నరసింహ మాట్లాడుతూ.. భూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఉపాధి కూలీలకు రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత మంజూరు చేయాలని, అర్హులైన వృద్ధులందరికీ పింఛన్లు ఇవ్వాలని కోరారు. శ్రీ ఉమామహేశ్వర ప్రాజెక్టు డిజైన్ మార్చాలని అన్నారు.

Comments

G
Loading comments...