వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర భాజపా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఈ నెల 6 నుంచి 14 వరకు కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ప్రచార యాత్ర చేపట్టనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తెలిపారు.
నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగం, ధరల పెరుగుదలపై 'బద్లావ్ జరూరీ హై' పిలుపుతో యాత్ర సాగుతుందని, శ్రేణులు జయప్రదం చేయాలని కోరారు.
Comments
Loading comments...

