వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల పట్టణ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా రెండో చెరువు నిర్మాణానికి రూ.32 కోట్లతో భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు. నిధులు మంజూరైతే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.
ప్రస్తుతం పట్టణంలోని 60 శాతం మందికే తాగునీరు అందుతోంది. రెండో చెరువు నిర్మాణంతో నిల్వ సామర్థ్యం పెరిగి శివారు ప్రాంతాలకు కూడా నిరంతర నీటి సరఫరా సాధ్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు.
Comments
Loading comments...
