వార్తలకు తిరిగి వెళ్లండి
కేవైసీ ఇవ్వకపోతే బ్యాంక్ ఖాతాల నిలిపివేత

కేవైసీ (KYC) వివరాలను సకాలంలో అప్డేట్ చేయని బ్యాంకు ఖాతాల్లో లావాదేవీలను నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశించింది. రిస్క్ ఆధారంగా రెండేళ్లు, ఎనిమిదేళ్లు, పదేళ్లకోసారి రీ-కేవైసీ తప్పనిసరి అని స్పష్టం చేసింది.
తెలంగాణలో ఏకంగా 24.59 లక్షల ఖాతాలు రీ-కేవైసీకి పెండింగ్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో కేవైసీ సమర్పించని ఖాతాల ఫ్రీజింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని బ్యాంకర్లను ఆర్బీఐ సూచించింది.
Comments
Loading comments...