వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలల ఆవరణలో, 50 మీటర్ల పరిధిలో జంక్ఫుడ్ విక్రయాలు, ప్రకటనలను నిషేధిస్తూ మహారాష్ట్ర ఎఫ్డీఏ ఉత్తర్వులు జారీ చేసింది. వడపావ్, సమోసాలు, కూల్ డ్రింక్స్ అమ్మకాలను నిలిపివేయాలని, లేకుంటే యాజమాన్యాలపై చర్యలుంటాయని హెచ్చరించింది.
నిబంధనల అమలును పరిశీలించేందుకు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపడతామని అధికారులు తెలిపారు. ముంబైలో నిబంధనలు పాటించని మూడు హోటళ్ల లైసెన్సులు సస్పెండ్ అయ్యాయి.
Comments
Loading comments...
