వార్తలకు తిరిగి వెళ్లండి

జక్రాన్పల్లి మండలం లక్ష్మాపూర్ తండాకు చెందిన నూనావత్ పీరు (45) ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందింది. బుధవారం మేకలను మేపేందుకు వెళ్లిన ఆమె కాలుజారి బావిలో పడిపోయింది.
కుటుంబ సభ్యులు ఆమెను బయటకు తీసుకురాగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. కుమారుడు యుగంధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై జి. మహేష్ తెలిపారు.
Comments
Loading comments...

