వార్తలకు తిరిగి వెళ్లండి
వైరల్ వార్తలుBreaking
అయోధ్యలో 40 రోజుల్లో 70 సార్లు చోరీ
కౌశిక్ శర్మ Jun 27, 2026 3:45 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago

అయోధ్య రాముడి విరాళాల దుర్వినియోగం కేసులో విస్మయపరిచే నిజాలు వెలుగుచూశాయి. సీసీటీవీలకు అడ్డుగా నిలబడి కొందరు సిబ్బందే నగదు, ఆభరణాలను దొంగిలించినట్లు సిట్ విచారణలో తేలింది. కేవలం 40 రోజుల్లోనే ఏకంగా 70 సార్లు చోరీలు జరగ్గా, సిట్ అధికారులు రూ.79.85 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ వ్యవహారంలో తన మాజీ డ్రైవర్ అరెస్ట్ కావడంతో నైతిక బాధ్యత వహిస్తూ.. తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, మరో సభ్యుడు అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
Comments
Loading comments...