వార్తలకు తిరిగి వెళ్లండి
డ్రగ్స్ మత్తులో పోలీసులపై దాడి

హైదరాబాద్ అబిడ్స్లో డ్రగ్స్ మత్తులో ఉన్న యువకుడు పోలీసులపైకి కారును దూసుకెళ్లడంతో కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. మరో కానిస్టేబుల్, సీఐ కూడా ఈ ఘటనలో గాయపడ్డారు.
డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు నిందితుడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పరారైన అతడిని అఫ్జల్గంజ్ వద్ద అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Loading comments...