వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ సింగ్నగర్లోని ఆంధ్రప్రభ కాలనీకి చెందిన కాకు సరోజిని(60)పై ఆమె కుమారుడు దాడి చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్యం, మందుల కోసం డబ్బులు అడిగినందుకు తనను కొట్టి, దూషించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ బి.కృష్ణమూర్తి గురువారం కేసు నమోదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

