వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా-ఇరాన్ మధ్య కీలక శాంతి చర్చలు జరుగుతున్న తరుణంలో, డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ కలకలం రేపింది. బాంబును మోసుకెళ్తున్న యుద్ధ విమానం, మిస్సైల్ ఫొటోలను ఆయన షేర్ చేయడంతో, ఇరాన్పై అమెరికా మళ్లీ దాడికి సిద్ధమవుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
త్వరలోనే ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న ప్రచారం నడుమ ఈ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. అయితే, ఇరాన్తో చర్చల విషయంలో తామేమీ తొందరపడటం లేదని ట్రంప్ గతంలోనే స్పష్టం చేశారు.
Comments
Loading comments...

