Back to feed
భారతీయుల నౌకపై అమెరికా దాడి
Rohit Singh Jun 09, 2026 12:55 PM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago

ఒమన్ తీరంలో భారతీయులున్న కార్గో నౌకపై అమెరికా మిలిటరీ దాడి చేసింది. ఇరాన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడమే ఈ చర్యకు కారణమని యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఈ ఘటనలో నౌక దెబ్బతినగా, భారత నౌకాదళం అప్రమత్తమై 24 మంది భారతీయులను సురక్షితంగా రక్షించింది.
పశ్చిమాసియా జలాల్లో అమెరికా కొనసాగిస్తున్న దిగ్బంధనం వల్ల ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ దాడితో ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిలో గందరగోళం నెలకొంది. ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు జరుగుతున్న తరుణంలోనే ఈ ఘర్షణ చోటు చేసుకోవడం గమనార్హం.
Comments
Loading comments...



