వార్తలకు తిరిగి వెళ్లండి
సంపులో పడి అస్సాం యువకుడి మృతి

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి శివారులోని ఓ గ్రానైట్ పరిశ్రమలో అస్సాంకు చెందిన కార్మికుడు దీపక్ ఘోష్ (22) సంపులో జారిపడి మృతి చెందాడు. ఈ నెల 14న అమావాస్య సెలవు రోజున ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
గురువారం ఉదయం యాజమాన్యం, తోటి కార్మికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Comments
Loading comments...