వార్తలకు తిరిగి వెళ్లండి

అస్సాంలో 135.87 కిలోమీటర్ల గువాహటి-తేజ్పూర్ నాలుగు లేన్ల కారిడార్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.8,970.20 కోట్ల వ్యయం అంచనా వేశారు.
ఎన్హెచ్-15పై చేపట్టే ఈ ప్రాజెక్టుతో ప్రయాణ సమయం తగ్గి, రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయని కేంద్రం తెలిపింది. ఇందులో ఐదు బైపాస్లు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ, పలు వంతెనలు, అండర్పాస్లు నిర్మించనున్నారు.
Comments
Loading comments...
