వార్తలకు తిరిగి వెళ్లండి

అసోంలో గత నెల వరదల వల్ల రూ.480 కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. 26,681 ఇళ్లు దెబ్బతిన్నాయని, 96,842 వరద బాధిత కుటుంబాలకు ఇప్పటికే రూ.15 వేల చొప్పున సాయం అందించినట్లు చెప్పారు.
చరైడియో, శివసాగర్, జోర్హాట్, గోలాఘాట్ జిల్లాల్లో నష్టం అంచనా కొనసాగుతోందని సీఎం తెలిపారు. దుర్గాపూజకు ముందే బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం తెలిపారు.
Comments
Loading comments...

