వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ అవయవదానానికి అంగీకారం తెలిపారు. మంగళవారం బాపట్ల ఏరియా వైద్యశాలలో నిర్వహించిన అవయవదాన పక్షోత్సవాల్లో అవయవదానానికి సంబంధించిన ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా అవయవదానానికి ప్రోత్సాహం ఇచ్చారు.
మరణానంతరం అవయవాలను దానం చేయడం ద్వారా పలువురికి ప్రాణదానం చేసే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల్లో అవయవదానంపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
Comments
Loading comments...

