వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ నెహ్రూనగర్ శివారులో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు 6వ టౌన్ ఎస్సై కే.సందీప్ తెలిపారు. వారి నుంచి 60 గ్రాముల గంజాయి, రెండు సెల్ఫోన్లు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
అబ్దుల్ జియా, షిండే అక్షయ్ కుమార్ నాందేడ్ నుంచి గంజాయి కొనుగోలు చేసి నిజామాబాద్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
Comments
Loading comments...

