వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 5 నుంచి 21 వరకు జరిగే ఏపీ టెట్–2026 పరీక్షలకు తిరుపతి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని డీఈవో కేవీఎన్ కుమార్ తెలిపారు. జిల్లాలోని 5 కంప్యూటర్ ఆధారిత కేంద్రాల్లో 11,391 మంది పరీక్షలు రాయనున్నారు.
దివ్యాంగ అభ్యర్థుల కోసం 40 మంది స్క్రైబ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు రెండు గంటల ముందే కేంద్రాలకు చేరుకుని హాల్టికెట్, ఫొటో గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచించారు.
Comments
Loading comments...

