వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హత ఉన్నవారందరికి ఇల్లు, పెన్షన్ ఇచ్చిన ఘనత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. బొబ్బిలిలో బుధవారం వైఎస్ఆర్ జయంతి నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వైఎస్ఆర్ ఆశయాలను వైసీపీ ప్రభుత్వం కొనసాగించి అర్హులకు సంక్షేమ పథకాలు ఇచ్చినట్లు చెప్పారు. పేదలకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు.
Comments
Loading comments...

