వార్తలకు తిరిగి వెళ్లండి
అదనపు ధాన్యం సేకరణకు ఓకే

తెలంగాణలో యాసంగి సీజన్కు సంబంధించి అదనపు ధాన్యం కొనుగోలుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఎఫ్సీఐకి ఇచ్చే బియ్యం లక్ష్యాన్ని 35 లక్షల టన్నుల నుంచి 43 లక్షల టన్నులకు పెంచుతూ లేఖ పంపింది.
రవాణాలో పక్కదారి పట్టకుండా వాహనాలకు ట్రాకింగ్ విధానం అమలు చేయాలని సూచించింది. బియ్యం సేకరణ లక్ష్యాన్ని పెంచాలని సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చేసిన విజ్ఞప్తిపై కేంద్రం స్పందించింది.
Comments
Loading comments...