వార్తలకు తిరిగి వెళ్లండి
ఏపీలో కొరియా పెట్టుబడుల ప్రోత్సాహానికి 'APEX-Korea'

దక్షిణ కొరియాలోని బుసాన్లో ఏపీఈడీబీ ఆధ్వర్యంలో 'APEX-Korea' పెట్టుబడిదారుల సహాయ కేంద్రాన్ని ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. కొరియా కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఈ కేంద్రం ఒక అనుసంధాన వేదికగా పనిచేస్తుంది.
ఈ సందర్భంగా బీఎన్కే ఫైనాన్షియల్ గ్రూప్ ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, అమరావతి అభివృద్ధికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ అందించాలని, అమరావతిలో తమ శాఖను ఏర్పాటు చేయాలని కోరారు.
Comments
Loading comments...