వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు 5 నుంచి 16 వరకు జరగనున్న ఏపీ టెట్-2026 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి ఆదేశించారు. సోమవారం అధికారులతో సమీక్షించిన ఆమె, విశాఖలోని 8 కేంద్రాల్లో 21,522 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు.
పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని అభ్యర్థులకు సూచించారు. దివ్యాంగుల కోసం 100 మంది స్క్రైబ్లను ఏర్పాటు చేశామన్నారు.
Comments
Loading comments...

