వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్వేదిలో రూ.2.5 కోట్లతో బ్రిటిష్ నాటి శిథిల స్లూయిస్ స్థానంలో నూతన స్లూయిస్ నిర్మాణం పూర్తయింది. దీంతో నాలుగు గ్రామాల్లో పంట పొలాల ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది.
ప్రస్తుతం అప్రోచ్ రోడ్డు పనులు జరుగుతుండగా, త్వరలో ఎమ్మెల్యే చేతుల మీదుగా దీనిని ప్రారంభించనున్నారు. రైతుల 50 ఏళ్ల పోరాటం ఫలించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...

