వార్తలకు తిరిగి వెళ్లండి

అనపర్తి మండలం లక్ష్మీనరసాపురంలోని ఇండస్ సెల్ టవర్ వద్ద రూ.25 వేల విలువైన 24 బ్యాటరీలు చోరీకి గురయ్యాయి. గుర్తుతెలియని వ్యక్తులు క్యాబినెట్ తాళాలు పగులగొట్టి బ్యాటరీలను అపహరించారు.
ఈ ఘటన ఈ నెల 5న జరగ్గా, గాలింపు అనంతరం సెక్యూరిటీ సూపర్వైజర్ మణిబాబు బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అదనపు ఎస్ఐ దుర్గాప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

