వార్తలకు తిరిగి వెళ్లండి
హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరుపై హైకోర్టు ఫైర్

తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించారనే ఆరోపణలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సోమవారం హైకోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తీరుపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసింది.
కోర్టు పరిధిలోని ఒక వివాదానికి సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి, కోర్టు ఆదేశాలను ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు.
Comments
Loading comments...