వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడీ నియామకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. పార్టీ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చేందుకు అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేస్తోందని ఆమె మండిపడ్డారు.
బీఆర్ఎస్ హయాంలో అంగన్వాడీ వ్యవస్థ పారదర్శకంగా ఉండేదని, కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక గందరగోళం నెలకొందని విమర్శించారు. నియామక ప్రక్రియపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

