వార్తలకు తిరిగి వెళ్లండి
పెద్దపల్లి మండలంలోని అందుగులపల్లిలో మంగళవారం కొండచిలువ కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన బొక్కల రవీందర్ ఇంట్లోకి చొరబడిన కొండచిలువ.. అక్కడ ఉన్న 3 కోళ్లను మింగేసింది.
కొన్ని రోజులుగా కోళ్లు వరుసగా మాయమవుతుండటంతో ఆందోళనలో ఉన్న రవీందర్, కొండచిలువను చూసి స్థానికులకు సమాచారం అందించారు. దీంతో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని కొండచిలువను సురక్షితంగా తరిమికొట్టారు.
Comments
Loading comments...

