వార్తలకు తిరిగి వెళ్లండి

హక్కుల సాధన కోసం అంబేడ్కర్ స్ఫూర్తితో ఉద్యమించాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ అన్నారు. బుధవారం పెంచికలపేట మండలం ఎలుకపల్లిలో నిర్వహించిన వేదిక సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించి పూలమాల వేశారు. ఉద్యమకారులు సంఘటితంగా పోరాడి తమ హక్కులను సాధించుకోవాలని సత్యనారాయణ సూచించారు.
Comments
Loading comments...

