వార్తలకు తిరిగి వెళ్లండి
అమిత్ షా రాజీనామా చేయాలి: ఎంపీ చామల

కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంటులో ప్రతిపక్షాల ప్రశ్నలకు కేంద్రం ఎందుకు సమాధానం ఇవ్వడంలేదని ప్రశ్నించారు.
గాయపడిన వారిని రాహుల్, ప్రియాంక గాంధీలతో కలిసి పరామర్శించినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ప్రధాని మోదీ ఎందుకు కాపాడుతున్నారో చెప్పాలన్నారు.
Comments
Loading comments...