వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ నగరానికి చెందిన యువకుడు మృతి చెందాడు. ఫ్లోరిడాలో జరిగిన యాక్సిడెంట్లో తెలంగాణకు చెందిన ముగ్గురు మరణించగా.. వీరిలో నిజామాబాద్ లోని గూపనపల్లికి చెందిన రాహుల్ ఉన్నాడు.
ఈ యువకుడు మూడు నెలల క్రితం ఎంఎస్ చేయడానికి అమెరికాకు వెళ్లాడు. ఇంతలోనే మృత్యువు అతడిని కబళించింది. రాహుల్ మృతితో తల్లిదండ్రులు హరిబాబు, నాగమణి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Loading comments...

