వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో బుధవారం అమావాస్య సందర్భంగా తెల్లవారుజామునే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పంచామృతాలతో విశేష అభిషేకాలు చేశారు. నగరంతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
Comments
Loading comments...

