వార్తలకు తిరిగి వెళ్లండి
అమర్నాథ్ యాత్రకు రికార్డు

అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది కీలక మైలురాయిని చేరుకుంది. ఇప్పటివరకు 4.14 లక్షల మంది భక్తులు పవిత్ర గుహను దర్శించినట్లు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు.
యాత్ర ప్రారంభమైన 18 రోజుల్లోనే ఈ స్థాయిలో భక్తులు రావడంతో కొత్త రికార్డు నమోదయ్యే అవకాశముంది. ఆగస్టు 28తో యాత్ర ముగియనుండగా, గత సంవత్సరాల గణాంకాలను అధిగమించే సూచనలు కనిపిస్తున్నాయి.
Comments
Loading comments...