వార్తలకు తిరిగి వెళ్లండి

మధిర పట్టణంలోని అజాద్ రోడ్డులో అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం తవ్విన గుంతలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వినాయక మండపాలతో రహదారి ఇరుకుగా మారడంతో స్కూల్ బస్సులు, ద్విచక్ర వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.
ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులు, వాహనదారుల అవస్థలు పెరుగుతున్నాయి. అధికారులు స్పందించి పనులు త్వరగా పూర్తిచేసి గుంతలను పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

