వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ విమానాశ్రయ భూసేకరణ ప్రక్రియపై సందిగ్ధత కొనసాగుతోంది. 2009.23 ఎకరాల భూసేకరణను ఈ ఏడాది డిసెంబరు 31లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, భూముల ఎంపికపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
2014లో సర్వే చేసిన భూములకు బదులుగా ఇతర ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. భూసేకరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...
