వార్తలకు తిరిగి వెళ్లండి
వైద్య రంగంలో ‘ఏఐ’ విప్లవం: డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి

కృత్రిమ మేధ (ఏఐ)తో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని ఏఐజీ హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. గతంలో దశాబ్దాలు పట్టే ఔషధ ఆవిష్కరణలు ఇప్పుడు ఏఐతో కొన్నేళ్లలోనే సాధ్యమవుతున్నాయన్నారు.
ఇక్ఫాయ్ యూనివర్సిటీ సదస్సులో మాట్లాడిన ఆయన.. ఏఐ వైద్యులకు ప్రత్యామ్నాయం కాదని, సహాయకారి మాత్రమేనని స్పష్టం చేశారు. క్యాన్సర్ నిర్ధారణ, టెలీమెడిసిన్, వ్యాధుల ముందస్తు అంచనాలో ఏఐ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.
Comments
Loading comments...