వార్తలకు తిరిగి వెళ్లండి

అఫ్గానిస్థాన్లోని ఖోస్ట్, కునార్, పక్తికా ప్రావిన్స్లపై పాకిస్థాన్ మంగళవారం రాత్రి జరిపిన వైమానిక దాడుల్లో 11 మంది చిన్నారులు, ఒక మహిళ సహా మొత్తం 13 మంది మరణించారు. పౌర నివాసాలే లక్ష్యంగా జరిగిన ఈ దాడుల్లో మరో 14 మంది తీవ్రంగా గాయపడినట్లు తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ వెల్లడించారు.
పాక్ దాడులను తాలిబన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అయితే, ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. సరిహద్దుల్లో నెలకొన్న ఈ దాడులతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకున్నాయి.
Comments
Loading comments...

