వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గామాత ఆషాఢమాసం వేడుకల్లో భాగంగా ఫలాంబరిగా దర్శనమిచ్చారు. అమ్మవారిని 32 రకాల పండ్లతో ప్రత్యేకంగా అలంకరించారు.
సెలవు రోజు కావడంతో ఉమ్మడి జిల్లావాసులతోపాటు పరిసర జిల్లాలైన కరీంనగర్, నిజామాబాద్, జంటనగరాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి ప్రత్యేక పూజలు కొనసాగాయి.
Comments
Loading comments...
