Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదుపుతప్పి బావిపైకి దూసుకెళ్లిన RTC బస్సు: ప్రయాణికులు సురక్షితం

Follow Udayam on Google
sudheer Sep 02, 2026 1:42 PM కరీంనగర్General
అదుపుతప్పి బావిపైకి దూసుకెళ్లిన RTC బస్సు: ప్రయాణికులు సురక్షితం - Udayam
కరీంనగర్ చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు బావిపైకి దూసుకెళ్లిన ఘటనలో ప్రయాణికులు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వెళ్తుండగా వాహనం అదుపుతప్పింది. బావి కట్టను ఢీకొని బస్సు ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రయాణికులు స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Comments

G
Loading comments...