వార్తలకు తిరిగి వెళ్లండి

అధిక లోడుతో ఆటోలు నడిపితే ఉపేక్షించేది లేదని వారిపై కేసులు నమోదు చేస్తామని విజయనగరం జిల్లా బొబ్బిలి రూరల్ CI మల్లికార్జునరావు హెచ్చరించారు.
ఆదివారం రామభద్రపురం - బొబ్బిలి రోడ్డులో ఆయన వాహనాలను తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆటోలలో సామర్ద్యానికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆటో డ్రైవర్లు, యూనియన్లకు సూచించారు.
Comments
Loading comments...

