Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అడవుల పరిరక్షణే లక్ష్యంగా విధులను నిర్వహించాలి

Follow Udayam on Google
p.g.murthy Sep 13, 2026 5:27 PM మంచిర్యాలGeneral
అడవుల పరిరక్షణే లక్ష్యంగా విధులను నిర్వహించాలి - Udayam
అడవులు, వన్యప్రాణుల పరిరక్షణే ధ్యేయంగా అటవీ అధికారులు, సిబ్బంది విధులను నిర్వహించాలని జన్నారం అటవీశాఖ ఎఫ్డిఓ రామ్మోహన్ సూచించారు. ఒరిస్సా, ఛత్తీస్గడ్, తదితర రాష్ట్రాలకు చెందిన ఎఫ్ఆర్ఓ శిక్షణ అభ్యర్థులు ఆదివారం జన్నారంలోని గోండుగూడా, పైడిపల్లి అటవీ బీట్లను సందర్శించారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంతంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల గురించి అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు ఉన్నారు.

Comments

G
Loading comments...