వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యార్థులు డ్రగ్స్ వాడితే కాలేజీలపై చర్యలు

విద్యార్థులు డ్రగ్స్ వాడినా, విక్రయించినా, ప్రోత్సహించినా సంబంధిత విద్యాసంస్థలను బాధ్యులు చేస్తామని డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే అవసరమైతే విద్యాసంస్థల లైసెన్సులు కూడా రద్దు చేయాలని సిఫార్సు చేస్తామన్నారు.
క్యాంపస్లలో విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రతి విద్యాసంస్థలో యాంటీ డ్రగ్స్ కమిటీ, సేఫ్టీ కోఆర్డినేటర్ను నియమించాలని సూచించారు.
Comments
Loading comments...